‘సింహా’ తర్వాత బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం కథానాయికగా ఎవరు చేస్తారా అని అభిమానుల్లో ఒకటే చర్చ. ఎట్టకేలకు ఆ చర్చకు తెరపడింది. బాలీవుడ్ భామ సోనాల్ చౌహాన్ ఇందులో నాయికగా నటించనున్నారు. జన్నత్, బుడ్డా హోగా తేరా బాప్ చిత్రాల ద్వారా బాలీవుడ్ తెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సోనాల్
తెలుగులో ఆమె ‘రెయిన్బో’ అనే సినిమాలో నటించారు. ఈ నెల 13 నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్లో మొదలుకానుంది. సోనాల్తో పాటు ఇందులో మరో కథానాయిక నటించనుంది. తెలుగులో అగ్ర పథాన దూసుకుపోతున్న నాయిక ఆ పాత్ర పోషిస్తారని సమాచారం.
సెప్టెంబర్ 15 నుంచి ఆమె షూటింగ్లో పాల్గొంటారని తెలిసింది. ‘దూకుడు’ లాంటి సెన్సేషనల్ హిట్ని అందించిన రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మాటలు: ఎం.రత్నం, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.