పాత తరం నటి మీనా కుమారి పాత్రలో నటించాలని బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కోరుకుంటోంది. సహజనటి మీనా కుమారి అంటే తనకెంతో ఇష్టమని, ఆమె జీవిత చరిత్రను సినిమాగా తీస్తే అందులో నటించాలని ఉందని అనిల్ కపూర్ తనయ సోనమ్ కపూర్ తెలిపింది. 'మీనా కుమారి పాత్రలో నటించాలని ఉంది. ఆమెది ఎంతో విషాదభరిత జీవితం' అని సోనమ్ పేర్కొంది.
ఢిల్లీ6, మౌసమ్, ఐ హేట్ లవ్ స్టోరీస్ సినిమాల్లో సొట్టబుగ్గల సోనమ్ వైవిధ్య భరిత పాత్రలు పోషించి పేరు తెచ్చుకుంది. గత ఆరేళ్లలో ఆమె డజను సినిమాల్లో నటించింది. ఇలీవల విడుదలయిన 'రాన్ జనా' సినిమాలో రజనీకాంత్ అల్లుడు ధనుష్ తో సోనమ్ కపూర్ జతకట్టింది. 'రాన్ జనా' పాకిస్థాన్ లోనూ విడుదలకానుంది. 'రాన్ జనా' సినిమాలో తన పాత్రకు మంచి పేరు రావడం పట్ల 28 ఏళ్ల సోనమ్ సంతోషం వ్యక్తం చేసింది.
'ట్రాజెడీ క్వీన్'గా పేరొందిన మీనా కుమారి ఎక్కువగా ఏడుపు పాత్రల్లో నటించారు. పాత తరం నటీమణుల్లో ప్రతిభావంతురాలైన, విజయవంతమైన నటిగా ఆమె పేరొందారు. వ్యక్తిగత జీవితంలోనూ ఆమె ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. వైవాహిక బంధం విచ్చిన్నమవడంతో తాడుగు బానిసయిన మీనా కుమారి కాలేయ పాడైపోవడంతో 39ఏళ్ల వయసులో కన్నుమూశారు.