-

ఉత్కంఠ భరితంగా...

29 Nov, 2014 00:26 IST|Sakshi
ఉత్కంఠ భరితంగా...

‘7/జి బృందావన్ కాలనీ’ ఫేమ్ సోనియా అగర్వాల్, అర్చన, వినోద్‌కుమార్, రవిప్రకాశ్, శివాజీ రాజా ముఖ్య తారలుగా రూపొందిన  చిత్రం ‘తరువాత కథ’. ప్రభాకరన్ దర్శకత్వంలో ఆర్. పద్మజ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది.

ఇప్పటివరకు వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్స్‌కి భిన్నంగా ఉండటంతో పాటు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగే చిత్రం ఇది. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది. పార్వతీ చంద్ ఇచ్చిన సంభాషణలు, తారక రామారావు స్వరపరచిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: ఉదయ్‌భాస్కర్ జాస్తి.