సోనుసూద్‌ వాడిన పాస్‌కు నెటిజన్ల ఫిదా‌..

30 May, 2020 16:24 IST|Sakshi

ముంబై: లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలోని వలస కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ రియల్‌ హీరోగా బాలీవుడ్‌ స్టార్‌ సోనూ సూద్ నిలుస్తున్నాడు. అతని సేవలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అయితే ‌సోనూసూద్‌కు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి నెటిజన్లు మక్కువ చూపుతున్నారు. ఈ క్రమంలో సోనూసూద్‌ 1997వ సంవత్సరం 24 సంవత్సరాల విద్యార్థిగా ఉన్న సమయంలో రైల్వే లోకల్‌ పాస్‌ను ఉపయోగించిన ఫోటోను కొందరు నెటిజన్లు ట్విటర్‌ వేదికగా పోస్ట్‌ చేశారు. సోనూసూద్‌ రూ.420 విలువ చేసే లోకల్‌ పాస్‌ను వాడినట్లు అరవింద్ పాండే అనే వ్యక్తి పాస్‌ను ట్వీట్ చేశాడు. సోనూసూద్‌ రైల్వే పాస్‌తో ప్రతి రోజు బోరివలీ నుంచి చర్చ్ గేట్ వరకు ప్రయాణం చేసేవాడని తెలిపారు.

సోనూసూద్‌ అనుసరించిన జీవన విధానం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. జీవితంలో ఎవరైతే కష్టపడి ఎదుగుతారో వారికి మాత్రమే ఇతరుల కష్టం విలువ తెలుస్తుంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ భావోద్వేగ ట్వీట్‌కు సోనుసూద్ రిట్వీట్ చేస్తు జీవితం వృత్తం లాంటిదని పేర్కొంటు అందరి హృదయాలను దోచుకున్నాడు. ఆయన రీట్వీట్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది. మరోవైపు రుబి శర్మ అనే నెటిజన్‌ స్పందిస్తు.. మీరు ఎల్లప్పుడు ఉత్సాహంగా ఉంటు పగలు రాత్రి తేడా లేకుండా 24 గంటలు అందరి మెసేజ్‌లకు రిప్లై ఇస్తున్నారు. మీకు అలసట రాదా సార్‌ అని ప్రశంసల వర్షం కురిపించాడు. మీరు చేస్తున్న సేవలు అమోఘమని సోనూసూద్‌ పై తనకున్న అభిమానాన్ని చాటాడు.

మరిన్ని వార్తలు