తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యునిగా ఎన్నికైన ప్రతాని రామకృష్ణగౌడ్ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూధనాచారి అభినందించారు. ప్రొడ్యూసర్స్ సెక్టార్ ఈసీ మెంబర్గా కూడా ఆర్కే గౌడ్ ఎన్నికైయ్యారు. మూడువందల పై చిలుకు ఓట్లు వేసి, గెలిపించిన నిర్మాతలకు ఆర్కే గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి కృషి చేస్తానన్నారు.