హైదరాబాద్: గోపాల గోపాల చిత్రం ప్రదర్శిస్తున థియేటర్పై ప్రేక్షకులు దాడి చేశారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్లో ఈ ఘటన జరిగింది. ప్రేక్షకులు థియేటర్లో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో సినిమాను మధ్యలోనే ఆపివేశారు. పవన్ కల్యాణ్ అతిథి పాత్రలో వెంకటేశ్ హీరోగా గోపాల గోపాల సినిమా శనివారం విడుదలైంది.
హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో గోపాల గోపాల సినిమాపై రఘునాథరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
హిందువుల మనోభావాలు దెబ్బతీసేవిధంగా ఈ ఈ సినిమాను చిత్రీకరించారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.