నాలుగు పాత్రల కథ

11 May, 2020 02:38 IST|Sakshi

బుల్లితెర యాంకర్, ‘బిగ్‌ బాస్‌ 3’ ఫేమ్‌ శ్రీముఖి ముఖ్యమైన పాత్రలో నటించిన చిత్రం ‘ఇట్స్‌ టైమ్‌ టు పార్టీ’. ఈ చిత్రంతో గౌతమ్‌ ఇ.వి.ఎస్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దితీప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి, క్రిష్‌ సిద్దిపల్లి, బాషా మొహిద్దిన్‌ షేక్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎయి¯Œ ్స మోషన్‌ పిక్చర్స్, కాక్‌టైల్‌ సినిమాస్‌ పతాకంపై అల్లం సుభాష్, గౌతమ్‌ ఇ.వి.ఎస్‌ నిర్మించారు. ఆదివారం (మే 10) శ్రీముఖి పుట్టినరోజు సందర్భంగా ‘ఇట్స్‌ టైమ్‌ టు పార్టీ’ సినిమాలోని ఆమె ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు.

ఈ సందర్భంగా గౌతమ్‌ ఇ.వి.ఎస్‌ మాట్లాడుతూ– ‘‘ఇదొక సైబర్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌. నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. యువతరం జీవితాలకు అద్దం పట్టేలా ఉంటుంది. ఇంతకు ముందెప్పుడూ ఇటువంటి పాత్రలో శ్రీముఖి నటించలేదు. ఆమె అభిమానులకు, ప్రేక్షకులకు ఈ క్యారెక్టర్‌ సర్‌ప్రైజ్‌ ఇస్తుంది. ప్రస్తుతం మా సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు చివరి దశలో ఉన్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: దిలీప్‌ కుమార్‌ ఎంఎస్, సంగీతం: శేఖర్‌ మోపూరి, సహ నిర్మాత: సిహెచ్‌ వేణు మాధవ్‌.

>
మరిన్ని వార్తలు