శర్వా సినిమాతో రీలాంచ్‌

15 May, 2018 10:20 IST|Sakshi
దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ అందించిన దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఒక్క ఫెయిల్యూర్‌తో కష్టాల్లో పడ్డాడు. మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన బ్రహ్మాత్సవం సినిమాకు డిజాస్టర్‌ టాక్‌ రావటంతో శ్రీకాంత్‌ అడ్డాల కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది. బ్రహ్మాత్సవం ఫెయిల్యూర్‌ తరువాత శ్రీకాంత్‌తో సినిమా చేసేందుకు ఏ హీరో ముందుకు రాలేదు. అందుకే తన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ను రీలాంచ్‌ లా ప్లాన్‌ చేస్తున్నాడు ఈ యువ దర్శకుడు.

2016 తరువాత ఒక్క సినిమా కూడా చేయని శ్రీకాంత్‌ అడ్డాల లాంగ్‌ గ్యాప్‌ తరువాత ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాలో శర్వానంద్‌ హీరోగా నటించనున్నాడు. అన్నదమ్ముల కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో యంగ్‌​ హీరో నటించే అవకాశం​ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం​ చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

మరిన్ని వార్తలు