సరదా సరదాగా...

19 Jun, 2016 22:42 IST|Sakshi
సరదా సరదాగా...

దర్శకుడు పూరి జగన్నాథ్ రెండో చిత్రం ‘బాచీ’లో జగపతిబాబు కథానాయకుడు. ఆ చిత్రం విడుదలై పదహారేళ్లయింది. ఇన్నేళ్లల్లో మళ్లీ పూరి-జగపతిబాబు కాంబినేషన్‌లో సినిమా రాలేదు. ఇప్పుడు ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు. అయితే కొంచెం మార్పు. ఈ చిత్రంలో జగపతిబాబు ప్రతినాయకుడు. కథానాయకుడిగా కల్యాణ్‌రామ్ నటిస్తున్నారు. మామూలుగా పూరి షూటింగ్ అంటే సరదా సరదాగా సాగుతుంది.

ఈ చిత్రం షూటింగ్ కూడా అలానే జరుగుతోందనడానికి ఇక్కడున్న ఫొటోయే నిదర్శనం. షాట్ గ్యాప్‌లో జగపతిబాబు-కల్యాణ్‌రామ్‌లకు పూరి ఎలాంటి హెల్ప్ చేస్తున్నారో చూశారుగా!