సుధీర్‌బాబు కొత్త చిత్రం ప్రారంభం

17 Aug, 2018 12:28 IST|Sakshi

‘సమ్మోహనం’ చిత్రం తరువాత సుధీర్‌ బాబు మంచి ఫామ్‌లోకి వచ్చాడు. ఈ సినిమా ఇచ్చిన కిక్‌లో వరుసగా ప్రాజెక్ట్‌లు ఓకే చేసేస్తున్నాడు. ప్రస్తుతం తన సొంత ప్రొడక్షన్స్‌లో ‘నన్ను దోచుకుందువటే’ సినిమాను చేస్తున్నారు. తాజాగా మరో ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. 

సుధీర్‌ బాబు, మెహ్రీన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ మూవీ షూటింగ్‌... శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్‌ వివి వినాయక్‌, పరుచూరి గోపాలకృష్ణ, దిల్‌ రాజు విచ్చేశారు. రిజ్వాన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు. పులి వాసు దర్శకత్వంలో  ఈ సినిమా తెరకెక్కనుంది. 

మరిన్ని వార్తలు