నాలుగు జీవితాలు 48 గంటలు...!

4 Mar, 2017 23:44 IST|Sakshi
నాలుగు జీవితాలు 48 గంటలు...!

నాలుగు జీవితాలు.. మూడు కోణాలు.. రెండు ప్రేమకథలు... 48 గంటల్లో ఊహించని మార్పులు.. అవన్నీ ‘నగరం’లోనే ఉన్నాయి. ఆ ఢిపరెంట్‌ కాన్సెప్ట్‌ ఏంటో చూడాలంటే  ఈ నెల 10 వరకు వెయిట్‌ చేయ్యాల్సిందే. ఏకేఎస్‌ ఎంటర్‌టైన్‌ మెంట్, పొటెన్షియల్‌ స్టూడియోస్‌ బ్యానర్లపై లోకేశ్‌ దర్శకత్వం లో రూపొందిన చిత్రం ‘నగరం’.

 జంటగా నటించారు. చిత్రనిర్మాత అశ్వనికుమార్‌ సహదేవ్‌ మాట్లాడుతూ– ‘‘నలుగురు  వ్యక్తుల మధ్య ఒక నగరంలో 48 గంటల్లో జరిగే కథ ఇది. సందీప్‌ కిషన్‌ది ఒక స్టోరి. రెజీనాది ఇంకో కథ. శ్రీ అనే వ్యక్తిది మరో స్టోరి. ఈ ముగ్గురినీ కలిపే డ్రైవర్‌ పాత్ర ఇంకొకటి. స్క్రీన్‌ప్లే బేస్డ్‌ చిత్రం. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రాన్ని ఈ నెల 10న విడుదల చేస్తున్నాం. తమిళంలో ‘మానగరం’గా రిలీజ్‌ అవుతుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: జావేద్‌ రియాజ్, కెమెరా: సెల్వకుమార్‌ ఎస్‌కె, ఎడిటింగ్‌: గౌతంరాజు.

>