‘గజిని’అంత సక్సెస్ అవుతుంది : ఛోటా కె. నాయుడు

19 Feb, 2015 22:25 IST|Sakshi
‘గజిని’అంత సక్సెస్ అవుతుంది : ఛోటా కె. నాయుడు

 ‘‘నా మేనల్లుడైన సందీప్ కిషన్ ఎప్పుడూ కొత్తదనానికే ప్రాధాన్యమిస్తాడు. ఈ చిత్ర దర్శకుడు ఆనంద్, మురుగదాస్‌కు శిష్యుడు. ఈ సినిమా స్క్రీన్‌ప్లే విన్న తర్వాత కచ్చితంగా ‘గజిని’ అంత సక్సెస్ అవుతుందనిపించింది’’ అని ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు చెప్పారు. సందీప్ కిషన్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్ కాంబినేషన్‌లో వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో ‘ఠాగూర్’ మధు సమర్పణలో ఎన్.వి. ప్రసాద్ నిర్మిస్తున్న ‘టైగర్’ పాటల ఆవిష్కరణ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు వీవీ వినాయక్, శాసన సభ్యులు భూమా నాగిరెడ్డి పాటల సీడీని ఆవిష్కరించి, హీరో ‘అల్లరి’ నరేశ్, నిర్మాత అనిల్ సుంకరకు అందించారు.
 
 వినాయక్ మాట్లాడుతూ -‘‘ ‘టైగర్’ సినిమా గురించి సందీప్ ఎంతో ఉద్వేగపడుతున్నాడు. తన కలలన్నీ తప్పకుండా నిజమవుతాయి’’ అన్నారు. సందీప్‌ను సూపర్‌స్టార్‌గా చూడాలనుకుంటున్నానని దర్శకుడు సుకుమార్ పేర్కొన్నారు. కెరీర్‌లో ఎదగడానికి దొరికిన గొప్ప అవకాశం ఇదని సందీప్‌కిషన్ చెప్పారు. ‘టైగర్’ పాటలు రికార్డులు సృష్టిస్తాయని సంగీత దర్శకుడు తమన్ ఆశాభావం వెలిబుచ్చారు. ఈ వేడుకలో రకుల్ ప్రీత్‌సింగ్, రాహుల్ రవీంద్రన్, సీరత్ కపూర్, ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు, శానం నాగ అశోక్‌కుమార్, అలంకార్ ప్రసాద్ ‘మధుర’ శ్రీధర్, చిన్మయి తదితరులు మాట్లాడారు.