అతిథి పాత్రలో మెరవనున్న సునీల్!

10 Apr, 2016 17:59 IST|Sakshi
అతిథి పాత్రలో మెరవనున్న సునీల్!
చెన్నై: కమెడియన్గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం హీరోగా అదరగొడుతున్న సునీల్.. తన తదుపరి చిత్రంలో అతిథి పాత్రలో దర్శనమివ్వనున్నాడు. మంచు విష్ణు, రాజ్ తరుణ్ హీరోలుగా నటించిన 'ఈడోరకం ఆడోరకం'  సినిమాలో సునీల్ ఒక గెస్ట్ రోల్లో నటించాడని ఈ సినిమాకి దర్శకత్వం వహించిన జీ నాగేశ్వర రావు తెలిపారు. ఈ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్లో కూడా సునీల్ తళుక్కుమంటాడట. ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో సోనారికా భండోరియా, హెబ్బా పటేల్లు కథానాయికలుగా నటించారు.