అమెరికా టు ఇండియా!

29 Jan, 2016 23:45 IST|Sakshi
అమెరికా టు ఇండియా!

‘‘ఫిబ్రవరి 5న మేము నవ్వించేందుకు రెడీగా ఉన్నాం. అదే రోజున ‘స్పీడున్నోడు’, ఫిబ్రవరి 12న ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ రిలీజ్ చేస్తామని నిర్మాతలు రిక్వెస్ట్ చేశారు. వారికి బెనిఫిట్ అవ్వాలని మా చిత్రం 19కి  వాయిదా వేశాం. కుటుంబమంతా కలిసి చూసే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. వాసువర్మ దర్శకత్వంలో సునీల్ హీరోగా, నిక్కీ గల్రానీ, డింపుల్ చోపడే హీరోయిన్లుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘కృష్ణాష్టమి’. ‘‘అమెరికా నుంచి ఇండియా వచ్చిన కుర్రాడికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని అతనెలా ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ కథ’’ అని దర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్.