అన్నదమ్ములు సూర్య, కార్తీ ఓ సినిమాకు చేతులు కలపనున్నారు. అయితే వీరిద్దరూ సిల్వర్స్క్రీన్ను షేర్ చేసుకుంటున్నారనుకుంటే పొరపాటే. ఎందుకంటే తమ్ముడు కార్తీ నటించబోయే సినిమాకు అన్నయ్య సూర్య నిర్మాతగా వ్యవహరించనున్నారట. స్టూడియో గ్రీన్ బ్యానర్పై జ్ఞానవేల్ ప్రొడక్షన్లో ‘గ్యాంబ్లర్’ ఫేమ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ చిత్రం తెరకెక్కించనున్నారని కోలీవుడ్ సమాచారం.
ప్రస్తుతం కార్తీ హెచ్. వినోద్ డైరెక్షన్లో ‘ధీరమ్ అధిగారమ్ ఒండ్రు’ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. రకుల్ప్రీత్సింగ్ హీరోయిన్గా యాక్ట్ చేస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్లో రిలీజ్ కానుంది. మరోవైపు హీరో సూర్య ‘సింగం 3’ వంటి డీసెంట్ హిట్ తర్వాత విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ‘తానా సేంద కూట్టమ్’ చిత్రంలో యాక్ట్ చేస్తున్నారు. మరి.. అన్నయ్య నిర్మాతగా తమ్ముడు హీరోగా సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలి.