పొల్లాచ్చి పోదాం

15 Jul, 2018 04:34 IST|Sakshi
సూర్య

లండన్‌ నుంచి పొల్లాచ్చికి షిఫ్ట్‌ అయ్యారు సూర్య. లండన్‌లో ఆపేసిన ఆపరేషన్‌ను పొల్లాచ్చిలో తిరిగి స్టార్ట్‌ చేయనున్నారట. కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ను లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్నారు. మోహన్‌లాల్, ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో సాయేషా కథానాయిక. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ లండన్‌లో స్టార్ట్‌ అయింది. లేటెస్ట్‌ షెడ్యూల్‌ను పొల్లాచ్చిలో జరపనున్నారు. ఈ షెడ్యూల్‌లో సూర్యతో పాటు మిగతా చిత్రబృందం కూడా పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు