టాప్‌ సాంగ్‌!

23 Sep, 2018 01:54 IST|Sakshi
సల్మాన్‌ఖాన్‌, కత్రినా కైఫ్‌

గతేడాది డిసెంబర్‌లో రిలీజైన సల్మాన్‌ఖాన్‌ ‘టైగర్‌ జిందా హై’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం సాధించింది. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్‌ కథానాయికగా నటించారు. అంతేకాదు ‘ఏక్‌ తా టైగర్‌’ సినిమా తర్వాత ఐదేళ్లు గ్యాప్‌ ఇచ్చి సల్మాన్, కత్రినా కలిసి చేసిన చిత్రమిదే కావడం విశేషం. అలాగే ఈ సినిమాలోని ‘స్వాగ్‌ సే స్వాగత్‌’ సాంగ్‌కు యూ ట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్‌కు యూ ట్యూబ్‌లో 600 మిలియన్‌ (60 కోట్లు) వ్యూస్‌ వచ్చాయి.

ఈ ఫీట్‌ను సాధించిన తొలి ఇండియన్‌ సాంగ్‌ ఇదేనని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని పాటలకు విశాల్‌–శేఖర్‌ ద్వయం సంగీతం అందించారు. ‘స్వాగ్‌ సే స్వాగత్‌’ పాటకు విశాల్, నేహా గాత్రం అందించారు. ఇర్షాద్‌ కామిల్‌ లిరిక్స్‌ అందించారు. వైభవి మర్చెంట్‌ కొరియోగ్రాఫర్‌. ఇప్పటికే 600 మిలియన్స్‌ను టచ్‌ చేసిన ఈ పాట ప్యూచర్‌లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అలాగే అలీ అబ్బాస్‌ జాఫర్‌–సల్మాన్‌ ఖాన్‌–కత్రినా కాంబినేషన్‌లోనే రూపొందుతున్న ‘భారత్‌’ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్‌ కానున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు