గాయని మంగ్లీ ప్రధాన పాత్రలో కేపీఎన్ చౌహాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్వేచ్ఛ’. రాయనపాటి లక్ష్మీ కుమారి సమర్పణలో చెర్రీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సతీష్ నాయుడు నిర్మించిన ఈ సినిమా సెన్సార్ దశలో ఉంది. కేపీఎన్ చౌహాన్ మాట్లాడుతూ– ‘‘పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో, ఈ సృష్టికి ఆడపిల్ల కూడా అంతే ముఖ్యమనే క«థతో తెరకెక్కిన చిత్రమిది. లవ్, సెంట్మెంట్ ఉన్నాయి. మంచి కథ, కథనం, పాటలు, మాటలు కుదిరాయి’’ అన్నారు. ‘‘అందమైన ఫొటోగ్రఫీ అందించిన విజయ టాగూరు, సతీష్ వేములపూడి గార్లకు, చక్కని మ్యూజిక్ అందించిన భోలే షావలిలకు కృతజ్ఞతలు. జూన్ రెండో వారంలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు సతీష్ నాయుడు.