జర్నీ ఎండ్‌!

21 May, 2019 00:58 IST|Sakshi
చిరంజీవి

సుదీర్ఘ ‘సైరా’ ప్రయాణం క్లైమాక్స్‌కు వచ్చింది. ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ దాదాపుగా పూర్తయిందని తెలిసింది. చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా’. స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్‌ నిర్మాత. నయనతార, తమన్నా కథానాయికలు. ఇటీవలే చిరంజీవి, తమన్నాలపై ఓ సాంగ్‌ను షూట్‌ను పూర్తి చేశారు. ఈ నెలాఖరులో అనుష్కతో రెండు రోజులు సీన్స్‌ చిత్రీకరించనున్నారు. చిన్న చిన్న ప్యాచ్‌ వర్క్‌ మినహా షూటింగ్‌ పూర్తయిందట. వీఎఫెక్స్‌ వర్క్స్‌ కూడా అనుకున్న సమయానికి జరిగితే సినిమాను గాంధీ జయంతికి రిలీజ్‌ చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్‌ సేతుపతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు సంగీతం: అమిత్‌ త్రివేది, కెమెరా: రత్నవేలు.

మరిన్ని వార్తలు