కేరళలో ఖేల్‌ ఖతమ్‌

20 Apr, 2019 02:21 IST|Sakshi
చిరంజీవి

‘సైరా’ ప్రయాణం పూర్తి కావస్తోంది.  షూటింగ్‌ ఖేల్‌ ఖతమ్‌ చేయడానికి కేరళ అడవుల్లో షూటింగ్‌ చేస్తోంది చిత్రబృందం. చిరంజీవి హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా: నరసింహారెడ్డి’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు.

నయనతార, తమన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి కానుందని సమాచారం. అమితాబ్‌ బచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్‌ సేతుపతి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అమిత్‌ త్రివేది సంగీత దర్శకుడు. అక్టోబర్‌లో ఈ సినిమాను రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు