కొత్త లుక్‌లో థ్రిల్‌

12 Aug, 2019 01:50 IST|Sakshi
తాప్సీ

సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌ సినిమాల్లో భయపెట్టడానికి దెయ్యం, పాడుబడిన భవంతులు,  చీకట్లో కొన్ని సన్నివేశాలు తీయడం కామన్‌. ఇవేమీ లేకుండా ఓ సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌ ప్లాన్‌ చేశారు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌. తాప్సీ ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఇది వరకు అనురాగ్‌ కశ్యప్‌  దర్శకత్వంలో వచ్చిన ‘మన్‌మర్జియా’, ఆయన నిర్మాణంలో వచ్చిన ‘సాంద్‌ కీ ఆంఖే’లో హీరోయిన్‌గా నటించారు తాప్సీ. ఈ సూపర్‌ న్యాచురల్‌ థ్రిల్లర్‌ విశేషాలను తాప్సీ తెలుపుతూ – ‘‘ఇప్పటి వరకు ఇండియన్‌ స్క్రీన్‌ మీద చూడనటువంటి అంశాలు మా సినిమాలో ఉంటాయి.

ఈ సినిమాలో పలు గెటప్స్‌లో కనిపిస్తాను. గుర్తుపట్టలేనటువంటి లుక్‌ కాదు కానీ ఇప్పటివరకూ మీరు చూడని గెటప్‌లో మాత్రం కచ్చితంగా కనిపిస్తాను. షూటింగ్‌ మొత్తం విదేశాల్లో చేస్తాం. అనురాగ్‌తో సినిమా అంటే మానసికంగా ప్రిపేర్‌ అయ్యుండాలి. షూటింగ్‌ ముందు ఏదో ఓ బాంబ్‌ వేస్తాడు. ‘మన్‌మర్జియా’ షూటింగ్‌ రెండు రోజుల ముందు జుత్తు మొత్తం రంగు వేసుకోమన్నాడు. అందుకే ఈసారి నేను రెడీగా ఉన్నాను. గుండు చేయించుకోవడానికి తప్ప ఏం చేయమన్నా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను (నవ్వుతూ)’’ అన్నారు.

మరిన్ని వార్తలు