మా ఇద్దరి మధ్య ఏమీ లేదు

2 Mar, 2019 00:42 IST|Sakshi
తమన్నా, హృతిక్‌

వినోద ప్రపంచంలో ఎక్కువగా ఆకర్షించేవి సినిమా, క్రీడలు. అది కూడా స్పోర్ట్స్‌లో క్రికెట్‌ది ప్రత్యేక స్థానం. సినిమా, క్రీడలను కలిపేది యాడ్స్‌. క్రికెటర్స్, మూవీ స్టార్స్‌ కలసి యాడ్‌ ఫిల్మ్స్‌లో కనిపించడం చాలాసార్లు చూశాం. 2012లో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, హీరోయిన్‌ తమన్నా ఓ యాడ్‌ ఫిల్మ్‌ కోసం కలిశారు. ఆ స్మార్ట్‌ఫోన్‌ యాడ్‌ చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ దగ్గరయ్యారని, డేటింగ్‌ చేశారని ఆ మధ్య వార్తలొచ్చాయి.

కానీ ఈ ఇద్దరిలో ఎవరూ ఆ వార్తలకు సమాధానం చెప్పలేదు. చాలా కాలం తర్వాత ఆ విషయం మీద ఓ షోలో మాట్లాడారు తమన్నా. ‘‘యాడ్‌ షూట్‌ సమయంలో నేను, విరాట్‌ గట్టిగా నాలుగు మాటలు కూడా మాట్లాడుకోలేదు’ అని పేర్కొన్నారు తమన్నా. ‘‘ఆ యాడ్‌ తర్వాత మేమిద్దరం మళ్లీ కలవలేదు, మాట్లాడుకోనూ లేదు. కానీ నేను యాక్ట్‌ చేసిన చాలామంది యాక్టర్స్‌ కంటే కూడా విరాట్‌ చాలా బెటర్‌ యాక్టర్‌’’ అని ప్రశంసించారు. ప్రస్తుతానికి ఎవరితో రిలేషన్‌షిప్‌లో లేనన్నారామె.

హృతిక్‌ ఒక్కరే మినహాయింపు
ఇదే షోలో మరికొన్ని విశేషాలు చెబుతూ – ‘‘సాధారణంగా సినిమాల్లో లిప్‌కిస్‌ సన్నివేశాలను చేయను నేను. ఏదైనా సినిమాకు సంతకం చేసేటప్పుడు నా కాంట్రాక్ట్‌లో ఆ నియమం కచ్చితంగా ఉంటుంది. కానీ హృతిక్‌తో కలసి నటిస్తే మాత్రం ఆ రూల్‌ని బ్రేక్‌ చేస్తానని సరదాగా ఫ్రెండ్స్‌తో జోక్‌ చేస్తుంటాను’’ అని పేర్కొన్నారామె.

>
మరిన్ని వార్తలు