నోటీసులు అందాయి

5 Oct, 2018 03:11 IST|Sakshi
తనుశ్రీ దత్తా

‘హార్న్‌ ఓకే ప్లీజ్‌’ (2008) సినిమా సెట్‌లో నటుడు నానా పటేకర్, ‘చాక్లెట్‌’ సినిమా సెట్‌లో దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తనతో అసభ్యంగా ప్రవర్తించారని నటి తనుశ్రీ దత్తా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇప్పుడు నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లింది. నానా పటేకర్, వివేక్‌ అగ్నిహోత్రి తరఫు న్యాయవాదులు తనుశ్రీకి నోటీసులు పంపారు. ‘‘తన పట్ల వివేక్‌ అగ్నిహోత్రి అమర్యాదగా ప్రవర్తించారన్న తనుశ్రీ మాటల్లో వాస్తవం లేదు. పబ్లిసిటీ లేదా వ్యక్తిగత లబ్ధి కోసమే ఆమె ఇలా చేస్తున్నారు’’ అన్నది ఆ నోటీసుల సారాంశమట. ‘‘నానా పటేకర్, వివేక్‌ అగ్నిహోత్రిల నుంచి నాకు గురువారం నోటీసులు వచ్చాయి.

వేధింపులు, అవమానం, అన్యాయాలకు నోరు విప్పితే ఇక్కడ ఇలాంటి బహుమతులు వచ్చాయి. నానా, వివేక్‌ బృందాలు నాపై బురద చల్లడానికి అసత్యాలు మాట్లాడుతున్నారు’’ అని తను శ్రీ ఆవేదన వ్యక్తం చేశారని బాలీవుడ్‌లో తాజాగా కథనాలు వస్తున్నాయి. అంతేకాదు.. ‘‘ఎప్పుడో పదేళ్ల క్రితం నాటి సంఘటనను ఇప్పుడు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు. నానా పటేకర్‌ చాలా మంచి వ్యక్తి’’ అని ముంబై మంత్రి ఒకరు ఫోన్‌లో తనుశ్రీతో సంభాషించారని వార్తలు వస్తున్నాయి. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ ఫేమ్‌ ఫ్రీదా పింటో కూడా తనుశ్రీకి మద్దతు తెలిపారు. 

మరిన్ని వార్తలు