లొకేషన్లు ఫ్రీగా ఇచ్చినందుకు కృతజ్ఞతలు

28 May, 2020 00:19 IST|Sakshi

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి నిర్మాతల మండలి లేఖ

ఆంధ్ర ప్రదేశ్‌లో సినీ పరిశ్రమకు అవసరమైన సదుపాయాలను కల్పించాలని, స్టూడియోలు, ల్యాబ్స్‌ నిర్మాణానికి స్థలాలు, ఇండస్ట్రీ వర్గానికి హౌసింగ్‌కు అవసరమైన స్థలాలను కేటాయించాలని తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఏపీ సీయం జగన్‌మోహన్‌ రెడ్డిని కోరుతూ ఓ లేఖ రాసింది.

నిర్మాతల మండలి అధ్యక్షులు సి.కల్యాణ్, కార్యదర్శులు టి. ప్రసన్న కుమార్, వడ్లపట్ల మోహన్‌ బుధవారం ఈ లేఖను  ఏపీ టెలివిజన్‌ మరియు చిత్ర పరిశ్రమాభివృధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ టి.విజయ్‌కుమార్‌ రెడ్డికి, విజయ్‌చందర్‌కు అందించారు. ఏపీలో షూటింగ్‌ చేసుకోవడానికి ప్రభుత్వానికి చెందిన ప్రాంగణాలను ఉచితంగా అందిస్తున్నట్టు ఆదేశించిన ముఖ్యమంత్రి జగన్‌కి ఈ లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. చైన్నై నుంచి సినిమా పరిశ్రమ హైదరాబాద్‌ వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్టూడియోలను నిర్మించుకోవడానికి ఉదారంగా స్థలాలు కేటాయించారని ఈ లేఖలో ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు