డీటీహెచ్‌లో మిణుగురులు

23 Jan, 2014 23:33 IST|Sakshi
ఒక సినిమా థియేటర్లలో విడుదలైన రోజునే బుల్లితెరపై కూడా విడుదలైతే...? ఇంటిల్లిపాదీ ఎంచక్కా ఇంట్లోనే కూర్చుని చూసేయొచ్చు. ‘మిణుగురులు’ చిత్రం ఆ అవకాశాన్నే కల్పించబోతోంది. ఆశిష్ విద్యార్థి, సుహాసిని ముఖ్య తారలుగా అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి రూపొందించిన ఈ చిత్రం ఈరోజు విడుదలవుతోంది. బుల్లితెరకు ఎయిర్‌టెల్ వారు డీటీహెచ్ (డెరైక్ట్ టు హోమ్) విధానం ద్వారా విడుదల చేస్తున్నారు. హాస్టల్‌లో నివసించే అంధ బాల, బాలికల జీవితం చుట్టూ ఈ సినిమా తిరుగుతుందని దర్శకుడు తెలిపారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బాలల చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారని, ఇంకా ఆరు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు ఈ సినిమా ఎంపికైందని, డీటీహెచ్ ద్వారా విడుదలవున్న తొలి సినిమా ఇదేనని అయోధ్యకుమార్ చెప్పారు.
 
>