గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై శ్రీమతి సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో నవీన్ నాయని దర్శకత్వంలో తరుణ్ తేజ్ ,లావణ్య హీరో హీరోయిన్లుగా రూపొందిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఉండి పోరాదే'. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 31న విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత డాక్టర్ కె లింగేశ్వర్ మాట్లాడుతూ.. ‘మా 'ఉండి పోరాదే' చిత్రం సెన్సార్ పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. నేను గతంలో చెప్పినట్టు సినిమా 100 పర్సెంట్ సక్సెస్ అవుతుంది. సినిమా కథను నమ్మి ఈ సినిమా నిర్మించాను. ఫ్యామిలీకి సంబంధించి ఒక అద్భుతమైన కథాంశంలో దర్శకుడు నవీన్ ప్రతి ఫ్రేమ్ ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ లాగా తీశారు. ఆగష్టు 31 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. అందరూ థియేటర్ లో సినిమా చూసి పెద్ద సక్సెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను` అని అన్నారు.