ఫిబ్రవరి రెండో వారంలో వెండితెరపై ఆసక్తికరమైన పోటి నెలకొంది. మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్లు ఒక్క రోజు తేడాతో థియేటర్లలోకి వస్తున్నారు. తొలిప్రేమ, ఇంటిలిజెంట్ సినిమాలు ఈ నెల 9, 10 తేదిల్లో రిలీజ్ కానున్నాయి. 9వ తారీఖున మోహన్బాబు లీడ్ రోల్లో నటిస్తున్న గాయత్రి సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ మూడు సినిమాలకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మూడు చిత్రాలకు సంగీత దర్శకుడు ఒకరే.
తొలిప్రేమ, ఇంటిలిజెంట్, గాయత్రి చిత్రాలకు యువ సంగీత దర్శకుడు తమన్ సంగీత మందిస్తున్నారు. గాయత్రి సినిమా పనులు ఇప్పటికే పూర్తి కాగా తొలిప్రేమ, ఇంటిలిజెంట్ సినిమాలు ప్రస్తుతం రీ రికార్డింగ్ దశలో ఉన్నాయి. రెండు సినిమాలకు ఒకేసారి పని చేస్తున్న తమన్, ఆ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ‘తొలిప్రేమతో ఇంటిలిజెంట్గా పని జరుగుతోంది’ అంటూ ట్వీట్ చేశాడు తమన్. తొలి ప్రేమతో క్లాస్, ఇంటిలిజెంట్ తో మాస్ ఆడియన్స్ ని ఒకేసారి అలరిస్తున్నాడు ఈ యువ కళాకారుడు.
#tholiprema tho #intelligent ga pannijaruguthondhiiiii ♥️💯
— thaman S (@MusicThaman) 31 January 2018
🎹🎧 pic.twitter.com/iOnto9qHs1