తరువాత ఏమైంది..?

5 Apr, 2015 23:50 IST|Sakshi
తరువాత ఏమైంది..?

సస్పెన్స్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘తరువాత కథ’.  సోనియా అగర్వాల్, అర్చన, సమీర్, వినోద్‌కుమార్ ముఖ్యతారలుగా శ్రీ పద్మావతి ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్. పద్మజ నిర్మించారు. ప్రభాకరన్ దర్శకుడు. ఈ నెల మూడో వారంలో  సినిమా విడుదల కానుంది.  ప్రతి సన్నివేశం తరువాత ఏం జరుగుతుంది? అనే ఆసక్తిని రేకెత్తించే విధంగా ఈ చిత్రం ఉంటుందనీ, అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఉదయభాస్కర్, సంగీతం: తారక రామరావు, ఎడిటింగ్: రమే్‌ష్.