ఓ కామన్ మ్యాన్ ఆర్.బి.ఐ. నుంచి ఎలా డబ్బులు కాజేశాడు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘తస్కర’. కిరీటి, నీసా జంటగా లిబ్రా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై లిబ్రా మీడియా దర్శక బృందంతో మహ్మద్ అన్సారి నిర్మించారు. ఈ సినిమా ప్రచార చిత్రాన్ని గురువారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కిరీటి మాట్లాడుతూ - ‘‘ఎంతో పరిశోధన చేసి, ఈ చిత్రం రూపొందించాం. ఇంటలిజెంట్గా సాగే ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా ఉంటుంది.
ఎ.ఆర్. రెహమాన్ స్కూల్కి చెందిన రోహిత్ కుమార్ ఈ చిత్రానికి పాటలు స్వరపరిచారు. ఈ పాటలతో పాటు రాజేంద్ర పి.నాథ్ కెమెరా పనితనం అదనపు ఆకర్షణలుగా నిలుస్తాయి’’ అని చెప్పారు. మంచి స్క్రీన్ప్లేతో సాగే చిత్రమిదనీ, పాటలతో పాటు చక్కని నేపథ్య సంగీతం ఇవ్వడానికి ఆస్కారం ఉన్న కథ అని రోహిత్కుమార్ తెలిపారు. హాలీవుడ్ మూవీని తలపించే స్వచ్ఛమైన తెలుగు చిత్రమిదని నిర్మాత అన్నారు. కిరిటీ అద్భుతమైన కథ ఇచ్చారనీ, మంచి కెమెరా వర్క్ చూపించడానికి కుదిరిందని రాజేంద్ర చెప్పారు.