జనానికి నచ్చింది!

31 May, 2015 01:16 IST|Sakshi
జనానికి నచ్చింది!

‘‘ఈ సినిమా నాకో సవాల్. ఎందుకంటే, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు నన్ను నమ్మి ‘పండగ చేస్కో’ సినిమా కొన్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకున్నా. అది నిజం చేసుకోగలిగాను. ఈ సినిమా కొన్నుకున్నవాళ్లందరూ హ్యాపీ’’ అని దర్శకుడు గోపీచంద్ మలినేని అన్నారు.
 
 ఆయన దర్శకత్వంలో రామ్, రకుల్ ప్రీత్‌సింగ్, సోనాల్ చౌహాన్ నాయకా నాయికలుగా పరుచూరి ప్రసాద్ నిర్మించిన ‘పండగ చేస్కో’ శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ మధ్యకాలంలో విడుదలైన కొన్ని చిత్రాల్లోని పోలికలు ఈ చిత్రంలో కనిపించాయనే ప్రశ్నకు -‘‘ఇది ఫక్తు కమర్షియల్ సినిమా. జనానికి నచ్చే సినిమా అయితే సేఫ్ అనుకుని చేశాం.
 
 అందుకే సేఫ్ అయ్యాం’’ అన్నారు గోపీచంద్. తదుపరి ఓ స్టార్ హీరోతో సినిమా ఉందనీ, మురుగదాస్ అందించిన కథతో ఓ చిత్రం చేయనున్నాననీ తెలిపారు. ‘డాన్ శీను’ని హిందీలో అక్షయ్‌కుమార్ సంస్థతో కలిసి మురుగదాస్ నిర్మించాలనుకుంటున్నారనీ, దానికి ఎవరు దర్శకత్వం వహించాలనేది ఇంకా నిర్ణయించుకోలేదనీ గోపీచంద్ మలినేని చెప్పారు.
 

>