అన్యాయాలను ప్రశ్నించేలా!

28 Jun, 2015 00:04 IST|Sakshi
అన్యాయాలను ప్రశ్నించేలా!

అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో, ఓ అందమైన ప్రేమకథగా తెరకెక్కిన చిత్రం ‘యూత్‌ఫుల్ లవ్’. జూలై 3న ఈ చిత్రం విడుదల కానుంది.
 
 మనోజ్‌నందం, ప్రియదర్శిని జంటగా రాదారం రాజలింగం నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేముగంటి దర్శకుడు.
 
 ‘‘సమాజంలోని అన్యాయాల నేపథ్యంలో అమ్మాయిలు తమను తాము ఎలా రక్షించుకోవాలనే కథాంశంతో తెరకెక్కించాం. అంతర్లీనంగా సందేశం ఉంటుంది’’ అని చెప్పారు. థ్రిల్లర్ మంజు ఇందులో ప్రధాన పాత్రధారి.