యూరప్‌లో ఆటాపాటా

27 Jul, 2017 03:03 IST|Sakshi
యూరప్‌లో ఆటాపాటా

ఆగస్ట్‌ ఫస్ట్‌ వీక్‌ మహేశ్‌బాబు హైదరాబాద్‌లో ఉండరు. మరెక్కడ ఉంటారు? అంటే, యూరప్‌లో. అక్కడ రకుల్‌ ప్రీత్‌సింగ్‌తో ఆటాపాటాతో బిజీగా ఉండబోతున్నారు. ఈ బిజీ అంతా ‘స్పైడర్‌’ సినిమా కోసమే. ఈ ఇద్దరూ పాల్గొనగా యూరప్‌లో ఓ పాట చిత్రీకరించనున్నారు. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో ‘ఠాగూర్‌’ మధు సమర్పణలో ఎన్వీ ప్రసాద్‌ ఈ చిత్రం నిర్మిస్తున్నారు. 

ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘ఆగస్ట్‌ 1న యూరప్‌లో పాట చిత్రీకరణ మొదలుపెడతాం. అక్కడి బ్యూటిఫుల్‌ లొకేషన్స్‌లో షూట్‌ చేస్తాం. ఈ సాంగ్‌ చిత్రీకరణతో షూటింగ్‌ మొత్తం పూర్తవుతుంది’’ అన్నారు. ‘‘భారీ బడ్జెట్‌తో ‘స్పైడర్‌’ నిర్మిస్తున్నాం. మిక్సింగ్, గ్రాఫిక్స్‌ పనులూ వేగంగా జరుగుతున్నాయి. విజయదశమి కానుకగా సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు చిత్ర సమర్పకుడు ‘ఠాగూర్‌’ మధు.