యాక్షన్‌ ప్లాన్‌

20 Sep, 2019 03:08 IST|Sakshi
టైగర్‌ ష్రాఫ్‌

శత్రువులపై దాడి చేయడానికి యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేస్తున్నారు బాలీవుడ్‌ నటుడు టైగర్‌ ష్రాఫ్‌. ఈ ప్లాన్‌లో నేనూ పాలుపంచుకుంటాను అంటున్నారు శ్రద్ధా కపూర్‌. ‘భాగీ’ ఫ్రాంచైజీలో వస్తోన్న మూడో చిత్రం ‘భాగీ 3’. ౖటైగర్‌ ష్రాఫ్, శ్రద్ధా కపూర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అహ్మద్‌ఖాన్‌ దర్శకుడు. ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాల కోసం టైగర్‌ ష్రాఫ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల ముంబైలో ప్రారంభమైంది.  టైగర్, శ్రద్ధా, రితేష్‌ దేశ్‌ముఖ్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లోనే ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్‌ చేశారు. అక్టోబ రులో ‘భాగీ 3’ బృందం జార్జియా వెళ్లనుందని టాక్‌.

మరిన్ని వార్తలు