హీరో చెప్పిన టైటిల్‌ విని మోదీ నవ్వులు

9 May, 2017 16:15 IST|Sakshi
హీరో చెప్పిన టైటిల్‌ విని మోదీ నవ్వులు

బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ప్రధానమంత్రి నరేంద్రమోదీని సోమవారం కలిశారు. ఈ విషయాన్ని ఆయన తన ట్వీటర్ అకౌంట్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన తర్వాతి సినిమా 'టాయిలెట్‌: ఏక్‌ ప్రేమ్‌ కథ' గురించి మోదీకి చెప్పినట్లు తెలిపారు. సినిమా టైటిల్‌ విన్న మోదీ నవ్వారని చెప్పారు. సినిమా కథను కూడా ఆసక్తిగా విన్నట్లు చెప్పారు.

టైటిల్‌పై మోదీ స్పందన తనను ఆనందానికి గురి చేసినట్లు వివరించారు. కాగా, ఈ సినిమాను జూన్‌ 2వ తేదీన విడుదల కానుంది. ప్రధానమంత్రి స్వచ్చభారత్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ నారాయణ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.