కరోనా విరాళం

7 Apr, 2020 05:37 IST|Sakshi


కృష్ణంరాజు, శ్యామలా దేవి – 10 లక్షలు  (‘ పీయం కేర్స్‌’కు)
(శ్యామలా దేవి పుట్టినరోజు ఏప్రిల్‌ 13న. ఈ సందర్భంగా 4 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే కృష్ణం రాజు, శ్యామల కుమార్తెలు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తీ, సాయి ప్రదీప్తీ తమ పాకెట్‌ మనీ నుంచి తలా రెండు లక్షలు తీసి 6 లక్షలను విరాళంగా ప్రకటించారు.)


కె.కె. రాధా మోహన్‌ – 3 లక్షలు (సీసీసీ మనకోసం)


వీకే నరేష్‌ – 11 లక్షలు
( ‘సీసీసీ మనకోసం’కి 1 లక్ష, ‘మా’లో 100 మంది సభ్యులను దత్తత తీసుకుని ఒక్కో సభ్యుని కుటుంబానికి 10 వేలు సాయం. ఇప్పటికే 58 కుటుంబాలకు వారి వారి బ్యాంకు ఖాతాలో 10 వేలు చొప్పున డిపాజిట్‌ చేశారు).


ఆదిత్య మ్యూజిక్‌ అధినేతలు ఉమేశ్‌ గుప్త, సుభాష్‌ గుప్త, దినేశ్‌ గుప్త, ఆదిత్య గుప్తలు  కరోనాపై యుద్ధానికి – 31 లక్షలు విరాళం
 

>
మరిన్ని వార్తలు