పూరి హగ్‌...

23 Dec, 2017 00:43 IST|Sakshi

చిన్న చిత్రాల ద్వారా తమ ప్రతిభ నిరూపించుకుని ఫీచర్‌ ఫిల్మ్స్‌ డైరెక్టర్‌ అయిన వారు టాలీవుడ్‌లో ఉన్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ స్టార్‌ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న పూరి జగన్నాథ్‌ తొలిసారి ‘హగ్‌’ అంటూ ఓ షార్ట్‌ ఫిల్మ్‌ తెరకెక్కించడం విశేషం. ఇప్పటివరకూ డైరెక్టర్‌గా తనలోని ఒక కోణం మాత్రమే చూపించిన ఆయన ఈ నెల 31న మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించబోతున్నారు. బాలకృష్ణతో ‘పైసా వసూల్‌’ సినిమా తర్వాత తనయుడు ఆకాశ్‌తో ‘మెహబూబా’ సినిమా తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు పూరి.

‘ఈరోజు (శనివారం) సాయంత్రం 5 గంటలకు పూరి ఓ వార్త చెప్పబోతున్నారు’ అంటూ చార్మి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. తనయుడితో తీస్తున్న ‘మెహబూబా’ సినిమా గురించి చెబుతారా? లేక మరో విషయం ఏదైనా ఉంటుందా? అనే ఆసక్తి చాలామందిలో నెలకొంది. ‘‘నా తొలి షార్ట్‌ ఫిల్మ్‌ ‘హగ్‌’. ఈ నెల 31న ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నాం. రెడీగా ఉండండి’ అంటూ ‘హగ్‌’ పోస్టర్‌ కూడా పోస్ట్‌ చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు పూరి.

మరిన్ని వార్తలు