టీవీ ఛానల్‌ను ప్రశ్నించిన త్రిష!

4 Nov, 2018 16:14 IST|Sakshi

విజయ్‌ సేతుపతి, త్రిష జంటగా నటించిన ‘96’ సినిమా ఇటీవలె విడుదలైన సంగతి తెలిసిందే. తమిళ నాట ఈ మూవీ సూపర్‌హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రీమేక్‌ చేయాలని కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. 

అయితే ఈ చిత్రం ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో రన్‌ అవుతోంది. దీపావళి కానుకగా సన్‌ నెట్‌వర్క్‌ ఈ చిత్రాన్ని టీవీలో ప్రదర్శించబోతున్నట్లు ప్రకటించింది. దీనిపై త్రిష సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. ‘ఇప్పటికీ 80 శాతం థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తున్నారు. అలాంటప్పుడు ఇంత త్వరగా సినిమా ప్రీమియర్‌ షో వేయడం కరెక్ట్‌ కాదు. సంక్రాంతికి ప్రీమియర్‌ షో వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం’ అంటూ త్రిష ట్వీట్‌ చేసింది. 

మరిన్ని వార్తలు