ఉత్కంఠకు గురి చేసేలా...

1 Sep, 2016 00:14 IST|Sakshi
ఉత్కంఠకు గురి చేసేలా...

 ‘ఈరోజుల్లో’ ఫేమ్ శ్రీ, రవిబాబు, నాగేంద్రబాబు, సన, షాలిని ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం - ‘త్రివిక్రమన్’. స్వీయ దర్శకత్వంలో క్రాంతికుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లోగోను నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టైటిల్ లోగోను చినబాబు, ట్రైలర్‌ను రఘురామ కృష్ణంరాజు విడుదల చేశారు. క్రాంతికుమార్ మాట్లాడుతూ- ‘‘భిన్నమైన హర్రర్ కథ ఇది. చిత్రీకరణ సమయంలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర య్యాయి. కస్తూరి శ్రీని వాస్ సహకారంతో సహ నిర్మాత రామ కృషాణరావు పరిచ యమై నన్ను ముందుకు నడిపిం చారు’’ అన్నారు. శ్రీ, సంగీత దర్శకుడు రుంకీ  గోస్వామి పాల్గొన్నారు. దర్శకత్వ పర్యవేక్షణ: కస్తూరి శ్రీనివాస్, సహ నిర్మాత: తోటకూర రామకృష్ణారావు.

>