ఆత్మహత్య చేసుకుంది నా భర్త కాదు: నటి

30 Dec, 2019 07:35 IST|Sakshi

చెన్నై, పెరంబూరు: ఆత్మహత్యకు పాల్పడి మరణించింది తన భర్త కాదని బుల్లితెర నటి రేఖ పేర్కొంది. ఈ నెల 25న గోపీనాథ్‌ అనే వ్యక్తి పెరంబూరులో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అతను బుల్లితెర నటి, వ్యాఖ్యాత రేఖ భర్త అని, తన కార్యాలయంలో పని చేసే వేరే యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, ఈ వ్వవహారం కారణంగా గోపీనాథ్‌ రేఖ మధ్య తరుచూ గొడవలు జరిగేవని ప్రచారం జరిగింది. అక్రమ సంబంధం, అప్పుల బాధ కారణంగా గోపీనాథ్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని చర్చ జరిగింది. ఈ ప్రచారంపై బుల్లితెర నటి రేఖ స్పందిస్తూ.. ఆత్మహత్య చేసుకుంది తన భర్త కాదని, అతని భార్య పేరు జెనీఫర్‌ రేఖ అని తెలిపింది. ఆమె పేరులో రేఖ ఉండడంతో తన భర్త గోపీనాథ్‌ అని ప్రచారం చేశారని తెలిపారు.

మరిన్ని వార్తలు