అరుదైన కలయిక : నారా, మెగా కోడళ్లు

18 Nov, 2017 14:14 IST|Sakshi

నంది అవార్డుల వివాదంతో మెగా, నందమూరి కుటుండాల మధ్య దూరం పెరిగిందన్న ప్రచారం జరుగుతుంటే.. ఆ రెండు కుటుంబాలకు చెందిన వారు కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. తాజాగా మెగా కోడలు ఉపాసన ఓ ఆసక్తికరమైన ఫొటోను తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. ఈ రోజు జరిగిన ఓ రక్తదాన శిబిరంలో ఉపాసన, బ్రాహ్మణిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రాహ్మణితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసిన ఉపాసన.. 18 ఏళ్ల వయసులో రక్తదానం చేయటం ప్రారంభిస్తే ప్రతీ 90 రోజులకు ఒకసారి చొప్పున 60 ఏళ్ల వరకు చేయవచ్చు.. దాదాపు 500 మంది ప్రాణాలను కాపాడవచ్చు అంటూ కామెంట్ చేసింది.

మరిన్ని వార్తలు