సాక్షి, హైదరాబాద్ : రంగస్థలం సినిమా విజయం సాధించడంతో మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తేజ్ భార్య ఉపాసన తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని కాలినడకన వెళ్లి దర్శించుకున్నారు. గురువారం సాయంత్రం అలిపిరి నుంచి కాలినడకను ప్రారంభిస్తున్న ఫొటోలను ఆమె ట్విటర్లో పంచుకున్నారు.
బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన రంగస్థలం సినిమా భారీ వసూళ్లను రాబడుతోన్న విషయం తెలిసిందే. చిత్రంలో చెవిటి వ్యక్తి పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
#RamCharan #Rangasthalam 🙏🏼 pic.twitter.com/TRK1hmtchp
— Upasana Kamineni (@upasanakonidela) 12 April 2018