పాకిస్తాన్కు భారత్ సత్తా ఏంటో చూపెట్టిన సర్జికల్ స్ట్రైక్ ఘటన ఎంతటి సెన్సేషన్ క్రియేట్చేసిందో అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా తెరకెక్కిన ‘యూరీ’ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అంచనాలను మించి ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
అయితే ఇటీవలె ఈ సినిమాను వీక్షించిన యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశ భక్తిని పెంపొందించేలా ఈ చిత్రం ఉందని కొనియాడారు. ఈ సినిమాను జీఎస్టీ నుంచి మినహాయిస్తున్నట్టు ప్రకటించారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీకి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు.