దెయ్యమైనా వదలడు

24 Sep, 2019 00:25 IST|Sakshi
సిద్ధార్థ్‌

‘బొమ్మరిల్లు’ ఫేమ్‌ సిద్ధార్థ్‌ నటించిన తాజా చిత్రం ‘వదలడు’. కేథరిన్‌ థెరిస్సా హీరోయిన్‌గా నటించారు. సాయిశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్‌ 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రఖ్యాతిగాంచిన టి.అంజయ్య సమర్పణలో పారిజాత క్రియేషన్స్‌ పతాకంపై టి. నరేష్‌కుమార్, టి. శ్రీధర్‌ తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా టి. నరేష్‌కుమార్, టి. శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘సినిమా రంగంపై అభిరుచి ఉండటంతో ఇండస్ట్రీకి వచ్చి, ‘ప్రేమంత ఈజీ కాదు, మిస్టర్‌ కె.కె’ సినిమాలు నిర్మించాం. తమిళ నిర్మాత ట్రిడెంట్‌ రవి నుంచి ‘వదలడు’ తెలుగు హక్కులు కొన్నాం. హారర్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. దెయ్యమైనా వదలడు అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కించారు. సిద్ధార్థ్‌–కేథరిన్‌ల మధ్య ప్రేమ విభిన్నంగా ఉంటుంది. దాదాపు 450 థియేటర్లలో మా సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్‌.కె. ఏకాంబరం, సంగీతం: ఎస్‌ఎస్‌. తమ¯Œ .

మరిన్ని వార్తలు