జూలైలో జాయినింగ్‌

10 Jun, 2019 05:24 IST|Sakshi

వాల్మీకి సెట్లో హీరోయిన్‌ లేకుండా వరుణ్‌ తేజ్‌ షూటింగ్‌ చేస్తున్నారు. ఈ వాల్మీకి జోడీ జూలైలో ఎంట్రీ ఇస్తారని లేటెస్ట్‌గా తెలిసింది. హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ‘వాల్మీకి’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజాహెగ్డే కథానాయిక. తమిళ నటుడు అధర్వ మురళి కీలక పాత్రలో నటిస్తారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర నిర్మింస్తున్న ఈ చిత్రం తమిళ సూపర్‌హిట్‌ ‘జిగర్‌దండ’ సినిమాకి రీమేక్‌. ఇందులో వరుణ్‌ తేజ్‌ తొలిసారి నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతోందట. జూలై నుంచి ‘వాల్మీకి’ టీమ్‌లో జాయిన్‌ అవుతారట పూజా హెగ్డే. మరోవైపు ఈ సినిమాను సెప్టెంబర్‌ 6న రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు