రామేశ్వరంలో పాఠాలు

28 Jul, 2018 04:17 IST|Sakshi
అదితీరావ్‌ హైదరీ, వరుణ్‌తేజ్‌

పుస్తకాలు, బ్యాగు కాకుండా స్క్రిప్ట్స్‌ పేపర్స్, కాస్ట్యూమ్స్‌ పట్టుకుని స్కూల్‌కి వెళ్లారు వరుణ్‌ తేజ్‌ అండ్‌ అదితీరావ్‌ హైదరీ. ఆ స్కూల్‌ అడ్రస్‌ హైదరాబాద్‌ది కాదు. తమిళనాడులోని రామేశ్వరంలో ఉంది. ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ హీరోగా స్పేస్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.

ఇందులో అదితీరావ్‌ హైదరీ, లావణ్యా త్రిపాఠి కథానాయికలుగా నటిస్తున్నారు. రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ తమిళనాడులోని రామేశ్వరంలో ఉన్న డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం స్కూల్‌లో జరుగుతోంది. ఈ షూట్‌ లోకేషన్‌ ఫొటోను షేర్‌ చేశారు అదితీరావ్‌ హైదరీ. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబర్‌ 21న విడుదల చేయాలనుకుంటున్నారు.

మరిన్ని వార్తలు