వరుణ్కి ఫిదా అంటున్న శేఖర్ కమ్ముల

5 Aug, 2016 13:21 IST|Sakshi
వరుణ్కి ఫిదా అంటున్న శేఖర్ కమ్ముల

లోఫర్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మెగా హీరో వరుణ్ తేజ్, ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే నటుడిగా మంచి మార్కులు సాధించిన వరుణ్.. ఈ సినిమాతో కమర్షియల్ స్టార్గా  ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత మరోసారి ఓ కూల్ ఎంటర్టైనర్తో ఆడియన్స్ ముందుకు రావడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు వరుణ్.

కాఫీలాంటి చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించిన వరుణ్ తేజ్... ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసేస్తున్నాడు. ఇప్పటికే కథా కథనాలు కూడా ఫైనల్ అయిపోగా హీరోయిన్గా మళయాల బ్యూటి సాయి పల్లివిని తీసుకున్నారు. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఇక ఈ సినిమాకు ఫిదా అనే టైటిల్ను పరిశీలుస్తాన్నారన్న టాక్ వినిపిస్తోంది. వరుణ్తో పాటు శేఖర్ కమ్ముల కెరీర్కు కూడా ఈ సినిమా కీలకం కావటంతో ఈ కాంబినేషన్పై భారీ హైప్ క్రియేట్ అవుతోంది.