సస్పెన్స్‌.. థ్రిల్‌

13 Aug, 2018 00:35 IST|Sakshi
కృష్ణసాయి, జహీదా శామ్‌

కృష్ణసాయి, జహీదా శామ్‌ జంటగా పి.ఎస్‌. నారాయణ దర్శకత్వంలో ఎం.ఎస్‌.కె ప్రమిదశ్రీ ఫిలింస్‌ బ్యానర్‌పై ఎం.ఎస్‌.కె.రాజు నిర్మిస్తున్న ‘వీడు అసాధ్యుడు’ చిత్రం  హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి నిర్మాత సీతారామరాజు కెమెరా సిచ్చాన్‌ చేయగా, నటుడు శివాజీ రాజా క్లాప్‌ ఇచ్చారు. నటుడు శివకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. పి.ఎస్‌.నారాయణ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాకు హీరో, నిర్మాత ఎం.ఎస్‌.కె.రాజుగారే.

హీరోగా కృష్ణసాయి అని స్క్రీన్‌ నేమ్‌ పెట్టుకున్నారు. క్రిమినల్‌ లాయర్‌గా పనిచేసే ఆయన సినిమా నిర్మించాలనే ఆకాంక్షతో ఈ రంగంలోకి అడుగుపెట్టారు’’ అన్నారు. ‘‘సినిమాపై ప్యాషన్‌తో ఈ రంగంలోకి వచ్చాను. సామాజిక స్పృహ ఉన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఇది. మంచి కంటెంట్‌తో కమర్షియల్‌ కథాంశంతో తెరకెక్కిస్తున్నాం’’ అన్నారు ఎం.ఎస్‌.కె.రాజు. ‘‘మంచి పాత్ర చేసే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు జహీదా శామ్‌. ఈ చిత్రానికి çశంభుప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.
∙కృష్ణ సాయి, జహీదా శామ్‌

మరిన్ని వార్తలు