వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వలపు ప్రయాణం

18 Nov, 2013 00:21 IST|Sakshi
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వలపు ప్రయాణం

 హైదరాబాద్, తిరుపతి మధ్య నడిచే అనేక ఎక్స్‌ప్రెస్‌లలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ ఒకటి. ఈ రైలులో వెళుతోన్న ఓ అమ్మాయి, ఓ అబ్బాయి జీవితాన్ని ఈ ప్రయాణం ఏ విధంగా మలుపు తిప్పింది? వలపులూ ఆ మలుపులూ తెలియాలంటే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ వచ్చేవరకూ ఆగాల్సిందే. సందీప్ కిషన్, రకుల్‌ప్రీత్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కిరణ్ నిర్మించిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘విభిన్న కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. రమణ గోగుల సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం’’ అని చెప్పారు. ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్‌రెడ్డి, బ్రహ్మాజీ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఛోటా కె.నాయుడు, ఎడిటింగ్: గౌతంరాజు.