బ్రేక్‌ కి బ్రేక్‌

23 Jan, 2018 04:41 IST|Sakshi

‘కమిషనర్‌ కూతుళ్లకు పెళ్లిళ్లు అవ్వవా’... ‘శివమణి.. నాక్కొంచెం మెంటల్‌’, ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్‌ బ్లాంక్‌ అవుతుందో’... ఇలా పూరి జగన్నాథ్‌ రాసే డైలాగ్స్‌ స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తాయి. ఇలాంటి మాసీ డైలాగ్స్‌ వెంకటేశ్‌ చెబితే సమ్‌థింగ్‌ డిఫరెంట్‌గా ఉంటుంది. కొత్త వెంకీ కనిపిస్తారు. పూరి జగన్నాథ్‌ ఎలానూ తన హీరోలను కొత్తగా చూపిస్తారు కదా. ఆయన డైరెక్షన్‌లో ఓ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంకీ కొత్త మేకోవర్‌లో కనిపిస్తారట.

ప్రస్తుతం తనయుడు ఆకాశ్‌ పూరీతో పూరి ‘మెహబూబా’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కాగానే వెంకీతో చేయబోయే సినిమా స్టార్ట్‌ చేస్తారట. యాక్చువల్లీ తేజ సినిమా వెంకీ చేయాల్సింది. కానీ ఎన్టీఆర్‌ బయోపిక్‌ను తేజ మొదలుపెట్టాలనుకుంటున్నారట. వెంకటేశ్‌ ఆ గ్యాప్‌ను  పూరీ సినిమాతో పూరిస్తారని ఫిల్మ్‌నగర్‌ సమాచారం. వచ్చే నెలలో ఈ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కుతుందని టాక్‌. సో.. ఇన్నాళ్ల బ్రేక్‌కి వెంకీ బ్రేక్‌ వేసేస్తారన్న మాట.

>
మరిన్ని వార్తలు