మెగా హీరోతో ఛలో డైరెక్టర్‌

22 May, 2018 16:20 IST|Sakshi

నాగశౌర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్‌ ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఛలో. నాగశౌర్య స్వయంగా నిర్మించిన ఈ సినిమాతో వెంకీ కుడుముల దర్శకుడిగా పరిచయమయ్యాడు. తొలి ప్రయత్నంలోనే ఘనవిజయం సాధించటంతో బడా నిర్మాణ సంస్థల దృష్టిలో పడ్డాడు వెంకీ. తాజాగా ఈ యువ దర్శకుడి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించి ఓ అప్‌డేట్ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

మెగా అల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందట. ప్రస్తుతం కరుణాకరన్‌ దర్శకత‍్వంలో తేజ్‌ ఐ లవ్‌ యు సినిమా చేస్తున్న సాయి ధరమ్‌ తదుపరి ప్రాజెక్ట్‌ను ఇంతవరకు ప్రకటించలేదు. కిశోర్‌ తిరుమల, చంద్రశేఖర్‌ ఏలేటి, గోపిచంద్‌ మలినేని లాంటి దర్శకులతో చర్చలు జరగుతున్నట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ లిస్ట్‌లో వెంకీ కుడుమల కూడా చేరాడు. వీరి కాంబినేషన్‌లో తెరకెక్కబోయే సినిమాను గీతా ఆర్ట్స్‌లో తెరకెక్కించనున్నారు.

మరిన్ని వార్తలు